మెగా నందమూరి కుర్ర హీరోలు కలిసి చేయబోయే మల్టీస్టారర్ సినిమా ఇప్పుడు టైటిల్ కూడా పెట్టేశారు.మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నందమూరి హీరో కళ్యాణ్ రాం కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ త్వరలో స్టార్ట్ అవనుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టైటిల్ రామకృష్ణ అని పెట్టబోతున్నారట.ఏ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కె.ఎస్.రామారావు నిర్మించబోతున్నారట.
మెగా హీరోల్లో మంచి ఫాంలో ఉన్న తేజు ఇప్పుడు ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాతో మరింత ఇమేజ్ పెంచుకోనున్నాడు.సినిమా కథ రాసుకుని కళ్యాణ్ రాం కు చెప్పగా అతనే సెకండ్ లీడ్ గా సాయి ధరం తేజ్ ను రిఫర్ చేశాడట.
సో ఇద్దరు కలిసి చేస్తున్న ఈ రామకృష్ణ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.మెగా నందమూరి సినిమాలు ఎప్పుడు బాక్సాఫీస్ దగ్గర వార్ కొనసాగిస్తాయి కాని ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబందించిన ఇద్దరు హీరోలు కలిసి నటించడం ఆ సినిమాకే ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చింది.
.