దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంతోమంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం స్టార్లుగా మారిపోయారు.
వారి దెబ్బకు ఆ టైంలో సీనియర్లు బాగా వెనకపడిపోయారు.ఈ కోవలోని వ్యక్తే అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి.
విశాఖ మేయర్గా పనిచేసిన సబ్బం హరి వైఎస్ చొరవతో 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు.వైఎస్ మృతి తర్వాత కూడా హరి వైఎస్ తనయుడు జగన్కు చాలా సపోర్ట్గా నిలిచారు.
తర్వాత జగన్తో ఆయనకు ఎక్కడ గ్యాప్ వచ్చిందో గాని దూరమయ్యారు.
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంతో సబ్బం హరి 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
హరి ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని అనుకున్నా పూర్తిగా సైలెంట్ అయ్యారు.మీడియాలోను, చర్చల్లోను సబ్బం హరి వాయస్ ఓ రేంజ్లో మార్మోగేది.
అయితే ఇప్పుడు ఆయన నామ్ కే వాస్తే కనపడడం మినహా ఏమీ చేయడం లేదు.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేసిన హరి వచ్చే ఎన్నికల్లో పొలిటికల్గా తిరిగి రీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
హరి టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.ఆయన పొలిటికల్ రీ యాక్టివ్ గురించి తెలుసుకున్న బీజేపీ సైతం ఆయన్ను తమ పార్టీలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది.
విశాఖ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హరిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.మరి హరి రూటు ఎలా ఉంటుందో చూడాలి.