ముద్దుగుమ్మ శృతిహాసన్ ‘శ్రీమంతుడు’ సినిమాతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మరింత క్రేజ్ను దక్కించుకుంది.దాంతో ఈమెకు రామ్చరణ్, ఎన్టీఆర్, మహేష్బాబుల సరసరన నటించే అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తమిళ చిత్రం ‘తని వరువన్’ రీమేక్లో రామ్చరణ్కు జోడీగా నటించనుందని, ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘జనతా గ్యారేజీ’ చిత్రంలో శృతిహాసన్ను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగిందని అలాగే మహేష్బాబు మురుగదాస్ల కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో శృతిహాసన్ను హీరోయిన్గా తీసుకున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లు మాత్రమే అని శృతిహాసన్ సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు.
రామ్ చరణ్ సినిమా కోసం తనను సంప్రదించింది లేదు అని, అలాంటప్పుడు తాను ఆ సినిమాలో ఎలా నటిస్తాను అంటూ శృతిహాసన్ సన్నిహితులతో చెబుతోంది.అదే విధంగా ఇప్పటి వరకు ఎన్టీఆర్, మహేష్బాబుల సినిమాల కోసం కూడా తనను ఎవరు అప్రోచ్ కాలేదు అని, అయితే తనకు ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను అంటోంది.
మహేష్బాబుతో మరోసారి నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నాను అంటూ శృతిహాసన్ తాజాగా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈమె తమిళం మరియు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.
ఈమె తర్వాతి తెలుగు సినిమా ఏంటి, ఎప్పుడు వస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.