టాలీవుడ్ క్వీన్ అనుష్కకు వింత చిక్కు వచ్చింది.ఈమె నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల అవ్వనుండటంతో ఎక్కడలేని కష్టాలు ఈమెకే వచ్చి పడ్డాయి.
ఈ రెండు చిత్రాలు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే.ఈ రెండు చిత్రాల ప్రమోషన్కు కూడా అనుష్క చాలా ముఖ్యం.
దాంతో ఈమె ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలో తెలియక తల పట్టుకుంది.‘రుద్రమదేవి’ చిత్రం కోసం ఈమె వారం ముందు నుండి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
అదే విధంగా ‘సైజ్ జీరో’ చిత్రానికి కూడా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తాను అంటూ అగ్రిమెంట్లో పేర్కొంది.
‘రుద్రమదేవి’ మరియు ‘సైజ్ జీరో’ చిత్రాలు అనుకోని పరిస్థితుల్లో రెండు ఓకే రోజున విడుదల కాబోతున్నాయి.
అక్టోబర్ 9కి ఈ రెండు సినిమాలు ఫిక్స్ అయ్యాయి.డేట్ దగ్గర పడుతున్నా కొద్ది అనుష్కకు టెంన్షన్ మరింతగా పెరిగి పోతుందట.
నిన్న మొన్నటి వరకు ఏదో ఒక సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని భావించిందట.కాని తాజాగా అందుతున్న వార్తల ప్రకారం రెండు సినిమాలు కూడా అక్టోబర్ 9న విడుదల ఖాయం అంటున్నారు.
అటు గుణశేఖర్ ఇటు ప్రకాష్ కోవెల మూడి ఇద్దరు కూడా తమ సినిమాల ప్రమోషన్ కోసం అనుష్కను బంతాట ఆడుకోవడం ఖాయం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.