టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’.ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులతో పాటు, సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొన్ని రోజుల ముందే ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యిందంటూ దర్శకుడు రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే.టాకీ పార్ట్ తర్వాత కొన్ని రోజులు నిర్మాణానంతర కార్యక్రమాలపై దృష్టి పెట్టిన రాజమౌళి తాజాగా మిగిలి ఉన్న రెండు పాటల చిత్రీకరణను మొదలు పెట్టాడు.
ప్రభాస్, తమన్నాలపై ఒక రొమాంటిక్ సాంగ్ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నాడు.కీరవాణి స్వరపర్చిన పాటను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.
ఈ రెండు పాటలకు దాదాపు 20 రోజులు పట్టే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు చెబుతున్నారు.ఈ పాటల చిత్రీకరణ తర్వాత పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జక్కన్న తలమునకలు కాబోతున్నాడు.
ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.రెండు పార్ట్లుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు, అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్స్గా నటిస్తున్నారు.
రానా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.