తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరా అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.రోజాపై ముప్పేట దాడికి దిగారు.
మగాళ్లు లేరనే విషయం నీకు ఎలా తెలుసు అని ఒకరు ప్రశ్నిస్తే.మగాళ్లు ఉన్నారో లేదో నీకే బాగా తెలుసు అని మరొరకు ఎద్దేవా చేశారు.మగాళ్లా? కాదా? అని చెప్పడానికి ఎమ్మెల్యే రోజా టెస్టింగ్ ఏజెన్సీ ఏమైనా పెట్టారా? అని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు నిలదీశారు
రాజకీయాల్లో ఆడ, మగ అనే తేడా ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.రోజా ‘ఐరన్ లెగ్’ అని అందరికీ తెలుసని విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి తమ పార్టీలోకి తీసుకున్నామంటూ ఆ పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపైనా గాలి మండిపడ్డారు.రోజా, బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కి ఎన్ని డబ్బులిచ్చి వైసీపీలోకి తీసుకున్నారో జగన్ చెప్పాలని గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండ్ చేశారు
మరోవైపు ఎమ్మెల్యే బొండా ఉమ కూడా రోజాపై సీరియస్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసింది రోజా కేనంటూ ఆయన సెటైర్ వేశారు.‘అమ్మా రోజారెడ్డి గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.
పదేళ్లు మాతోనే ఉన్నారు.ఎంతమంది మగవాళ్లతో ఉన్నారో మీకు తెలుసు.
ఎంతమంది మగవాళ్లను చూశారో మీకు తెలుసు.తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసిన వారు మీరే రోజారెడ్డిగారు’ అని ఉమ వ్యాఖ్యానించారు.