ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి, చంద్రబాబు చేత ప్రశంసలు పొంది ఇప్పడు ఆయనకు పరమ శత్రువైపోయింది అందాల తార రోజా.వైఎస్ జగన్ అధకారంలోకి వస్తాడని ఊహించి ఆ పార్టీలో చేరిన రోజాకు ఆశ నిరాశ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాత్రం సాధించింది.
టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు ఓడిపోయింది కదా.వైసీపీ నుంచి గెలిచాక బాబు మీద యమ విమర్శలు చేస్తోంది.అనరాని మాటలు అన్నది.చాలా తక్కువగా మాట్లాడింది.ఎమ్మెల్యేగా ఉండి బజారు మనిషిలా మాట్లాడటం చాలా తప్పు.కాని ఆమె తీరులో మార్పు లేదు.
తాజాగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.నెల్లూరులో పద్నాలుగుమంది అంగన్వాడీ వర్కర్లను సస్పెండ్ చేశారట.
వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రోజా డిమాండ్ చేసింది.వారి జీతాలు పెంచాలని కూడా కోరింది.
అన్ని నియోజకవర్గాల్లోని అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేయాలని కోరింది.ఏ నాయకుడు లేదా నాయకురాలై ప్రజాసమస్యలపై మాట్లాడటం మంచిదేగాని అసభ్యకరంగా నోరు పారేసుకోకూడదు.
రోజా అది తెలుసుకుంటే లీడర్గా ఎదుగుతుంది.