బాబుపై రోజా మండిపాటు

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి, చంద్రబాబు చేత ప్రశంసలు పొంది ఇప్పడు ఆయనకు పరమ శత్రువైపోయింది అందాల తార రోజా.వైఎస్‌ జగన్‌ అధకారంలోకి వస్తాడని ఊహించి ఆ పార్టీలో చేరిన రోజాకు ఆశ నిరాశ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాత్రం సాధించింది.

 Roja Blames Chandrababu-TeluguStop.com

టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు ఓడిపోయింది కదా.వైసీపీ నుంచి గెలిచాక బాబు మీద యమ విమర్శలు చేస్తోంది.అనరాని మాటలు అన్నది.చాలా తక్కువగా మాట్లాడింది.ఎమ్మెల్యేగా ఉండి బజారు మనిషిలా మాట్లాడటం చాలా తప్పు.కాని ఆమె తీరులో మార్పు లేదు.

తాజాగా అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలపై బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.నెల్లూరులో పద్నాలుగుమంది అంగన్‌వాడీ వర్కర్లను సస్పెండ్‌ చేశారట.

వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రోజా డిమాండ్‌ చేసింది.వారి జీతాలు పెంచాలని కూడా కోరింది.

అన్ని నియోజకవర్గాల్లోని అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేయాలని కోరింది.ఏ నాయకుడు లేదా నాయకురాలై ప్రజాసమస్యలపై మాట్లాడటం మంచిదేగాని అసభ్యకరంగా నోరు పారేసుకోకూడదు.

రోజా అది తెలుసుకుంటే లీడర్‌గా ఎదుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube