భారతీయ సినీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఏది అంటే వెంటనే బాహుబలి అని చెప్తాం.ఇంకొన్ని రోజులైతే మన సమాధానం మార్చాల్సిందే.
ఎందుకంటే బడ్జెట్ విషయంలో బాహుబలిని కొట్టే కసరత్తులు జరుగుతున్నాయి.ఇంతకి అంత ధైర్యం ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు.
ఇంకెవరు చేస్తారు.గ్రాఫిక్స్ సినిమాల ఒరవడి తీసుకొచ్చిన శంకర్.
సూపర్ స్టార్ రజినికాంత్ – శంకర్ కాంబినేషన్ లో రోబో – 2 సన్నాద్ధాలు జరుగుతున్నాయి.గతవారమే రజిని తన కూతురు ఐశ్వర్య ధనూష్ తో కలిసి లాస్ ఏంజెల్స్లో మేకప్ టెస్ట్ కి వెళ్లారు.
రొబో – 2 లో రజిని గెటప్ మీద ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేసారట.
ఇక ఈ చిత్రం బడ్జెట్ అంచనా 250-300 కోట్లు.
లికా ప్రొడక్షన్స్ ఈ విత్రాన్ని నిర్మిస్తారు.శంకర్ రూపొందించిన కథకు ఆ మాత్రం బడ్జెట్ లేకపోతే న్యాయం జరగదట.
నిర్మాత శుభాస్కరన్ అల్లిరాజ కుడా ఈ బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
బాహుబలి కి గ్రాఫిక్స్ సమకూర్చిన శ్రీనివాస మోహన్ ఈ చిత్రానికి పనిచేస్తారు.
నీరవ్ షా ఛాయగ్రహణ బాధ్యతలు చేపడతారు.ఆమీ జాక్సన్ ను కథనాయికగా అనుకుంటున్నారు.
ఇక శంకర్ ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాణిలు స్వరపరుస్తారు.