సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ – గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినషన్లో తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 2.0.వీరి కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన రోబో సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా వస్తోన్న 2.0 పై ఇండియన్ సినిమా హిస్టరీలో చరిత్ర క్రియేట్ చేస్తుందన్న భారీ అంచనాలు ఉన్నాయి.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకు గతంలో ఖర్చుపెట్టనంత భారీ బడ్జెట్తో రోబో 2.0 తెరకెక్కుతోంది.రోబో 2.0 కోసం ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలల సమయం తీసుకుంటున్నారు.
ఇక వచ్చే జనవరి 25న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ను కళ్లు చెదిరేలా నిర్వహిస్తున్నారు.దుబాయ్లో జరిగే ఈ వేడుకకు ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు.పలువురు హాలీవుడ్ స్టార్లు రోబో 2.0 ఆడియో వేడుకలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
రజనీకాంత్ సరసన బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, కిలాడీ కింగ్ అక్షయ్కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా కోసం అంతర్జాతీయ గ్రాఫిక్స్ వర్కర్లు పని చేస్తున్నారు.