కోన వెంకట్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.కొన్ని సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ కుడా అయ్యాయి.
కామెడి కి , సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఈ ద్వయం బాద్ షా తరువాత విడిపోయారు.వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు ఉన్నా రామ్ చరణ్ బ్రూస్ లీ మళ్ళి ఇద్దరినీ కలిపాడు.
అయితే అదంతా అతుకుల సంసారం అని తేలిపోయింది.
బ్రూస్ లీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మళ్ళి గొడవలు జరిగాయి.
కోన వెంకట్ ఒకటి చెప్తే వైట్ల ఒకడు తీసాడని కొందరు అంటే, వైట్ల కథలో వేలు పెట్టి కోన చెడగోట్టాడని కొందరు అంటారు.ఎవరు ఏం చేసినా, ఇక్కడ నష్టపోయింది రామ్ చరణ్, బ్రూస్ లీ నిర్మాత , బయ్యర్లు.
సినిమా ఫ్లాప్ అవడంతో వీరి గొడవలు బయటపడ్డాయి.కథ రచయితగా తన పేరు వేసినందుకు కోన కోపగించుకున్నాడని, వైట్ల మీద కేసు కుడా వేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే ఇందులో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం కుడా ఉంది.
శంకరాభరణం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కోన , తనకి వైట్లకి మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
బ్రూస్ లీ కోసం తానూ 72 సీన్లు రాసిచ్చానని, అందులో వైట్ల చాలా వరకు సీన్లు వాడుకోలేదని, అలాంటప్పుడు క్రెడిట్స్ లో తన పేరు వేసి పరువు తీయాల్సిన అవసరం ఏం వచ్చిందని చెప్పుకొచ్చాడు.అలాగే కేసు వేయాలనుకోలేదని, అదంతా మీడియా సృష్టే అని క్లారిటి ఇచ్చాడు కోన వెంకట్.