టీం ఇండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్కు దూసుకు పోయి మరోసారి ప్రపంచకప్పై ఆశలు రేపింది.అయితే సెమీస్లో ఆస్ట్రేలియా ముందు చేతులెత్తేసి, భారీ పరాజయాన్ని మూటకట్టుకుని వెనక్కు తిరిగి వచ్చింది.
దాంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కోట్లాది మంది అభిమానులు బాధను వ్యక్తం చేశారు.
కొందరైతే కన్నీరు మున్నీరు అయ్యారు.అయితే ఒక్కరు మాత్రం తాను టీం ఇండియా ఓడిపోయినందుకు చాలా సంతోష పడుతున్నాను అంటూ ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపర్చుతున్నాడు.
ఆయన మరెవ్వరో కాదు వివాదాల దర్శకుడు, తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
‘నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇండియా ఓడిపోవడమే అందుకు కారణం.నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు.
ఇక క్రికెట్ను ఇష్టపడే వారు అంటే నాకు మరింతగా ఇష్టం ఉండదు.నాకు దేశం అంటే ఇష్టం, అందుకే క్రికెట్ అంటే ఇష్టం లేదు.
క్రికెట్ వచ్చిన రోజు జనాలు పనులు మానేసి మరీ టీవీలకు అతుక్కు పోతారు.అలా చేయడం వల్ల ఎంతో ఆర్థిక నష్టం జరుగుతుంది.
అందుకే నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు అంటూ వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తాను అనున్న భావాలను ఎదుటి వారు ఏం అనుకుంటారో అనే ఫీలింగ్ లేకుండా చెప్పే ముక్కుసూటి మనిషి వర్మ.
అందుకే అందరు బాధలో ఉన్నా కూడా తాను సంతోషంగా ఉన్నాను అంటూ వర్మ ట్వీట్ చేశాడు.ఎంతైన వర్మ రూటే సపరేటు కదా…!
.