రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు కోరుతున్నారు.తాను మారిపోయానని, ఇకనుంచి ఎవరి జోలికి వెళ్ళనని చెబుతున్నారు.
నిద్రలో ఈ వాక్యాన్ని చదివారు అని అనుకునేరు .గిల్లి చూసుకోండి.నిజంగానే చదివారు.ఇకనుంచి పద్ధతిగా ఉంటానని తన తల్లి, డైరెక్టర్ స్పిల్ బర్గ్, అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు కూడా వేసారు.వర్మలో ఈ మార్పుకి కారణం వోడ్కా.ఆ వోడ్కా అలవాటులోనే మాటజారి ట్విట్టర్ జనాలకి దొరికిపోయారు.
వర్మలో ఈ మార్పు తీసుకొచ్చింది మురుగదాస్ తుపాకి సినిమా విలన్ విద్యుత్ జామ్ వాల్.అతనేం చేసాడంటే .
బాలివుడ్ కండలవీరుడు టైగర్ ష్రాఫ్ తెలుసుగా.ఈ కుర్రహీరో మార్షల్ ఆర్ట్స్ లో పెద్ద నేర్పరి.
ఇక విద్యుత్ టైగర్ కి ఏమాత్రం తక్కువ కాదు.ఎప్పటిలాగే వోడ్కా లాగించిన వర్మ, టైగర్, విద్యుత్ ఇద్దరు గొడవపడితే చూడాలి ఎవరు గెలుస్తారో .నాకు తెలిసి టైగర్ ని చూసి విద్యుత్ పారిపోతాడేమో, ఈజీగా ఓడిపోతాడేమి అని ట్విట్టర్ లో తన రాగం మొదలుపెట్టారు.ఎప్పుడులేనిది తన మీద పడ్డాడు ఏంట్రా బాబు అని విద్యుత్ వర్మకి కాల్ చేసాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కాల్ రికార్డు అవుతున్న విషయం వర్మకి తెలియదు.
ఫోన్లో కూడా మద్యం బాగా సేవించినట్టే మాట్లాడిన వర్మ, ట్విట్టర్ లో పోస్ట్ చేసినదానికి పూర్తి భిన్నంగా, ప్లేటు మార్చి, అసలైన మొగాడివి నువ్వే విద్యుత్, టైగర్ అమ్మాయి లాంటోడు, నాకైతే లింగ మార్పిడి చేసుకున్నవాడిలా కనిపిస్తాడు అంటూ ఇష్టంవొచ్చినట్టు మాట్లాడేసారు వర్మ.
విద్యుత్ రికార్డు చేసిన ఆ కాల్ ని ట్విట్టర్ లో పెట్టేసాడు.
దాంతో నా కళ్ళు తెరిపించావు విద్యుత్.
ఇకనుంచి నేను మారిపోయిన మనిషిని, ఎవరిని ఏమి అనను, ఇబ్బందిపడినవారందరికి సారి చెబుతున్నాను, గణపతి భక్తులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి కూడా నా క్షమాపణలు అంటూ మళ్ళీ ట్వీట్స్ పెట్టారు వోడ్కా వర్మ.మరి వర్మని నమ్మవచ్చా ? ఓ రెండురోజులు గడిస్తే మళ్ళీ పాతకథే మొదలవుతుందా?
.