విప్లవ చిత్రాల దర్శక, నిర్మాత, హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ఆర్.నారాయణ మూర్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు.
ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం నారాయణ మూర్తి కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఒక సినిమాకు సంబంధించిన విషయంలో నారాయణ మూర్తితో ఒక వ్యక్తి గొడవ పడి ఇలా దాడి చేయించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లాని శ్రీధర్తో ఆర్.
నారాయణ మూర్తి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల ముందుగా అనుకున్న కెమెరామెన్ను కాకుండా మరో కెమెరామెన్ను తీసుకోవడం జరిగిందట.దాంతో ఆ కెమెరామెన్ తనకు అవకాశం ఇవ్వకుండా నారాయణ మూర్తి అడ్డుకున్నాడు అంటూ కసి పెంచుకుని దాడి చేయించినట్లుగా తెలుస్తోంది.
దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లుగా పోలీసు వర్గాల వారు చెబుతున్నారు.ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో ఈ విషయం హాట్టాపిక్గా ఉంది.