కొన్ని వ్యాపార ప్రకటనల్లో అడుగున చిన్నగా ‘షరతులు వర్తిస్తాయి’ (కండిషన్్స అప్లయ్) అనే నిబంధన కనబడుతుంది.ఓటుకు నోటు కేసులో నిందితుడైన టీటీడీపీ ఎమ్మల్యే రేవంత్ రెడ్డికి కూడా హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ‘షరతులతో కూడిన’ బెయిల్ మంజూరు చేసింది.
దీన్ని కండిషన్్డ బెయిల్ అంటారు.దీని ప్రకారం ఐదు లక్షల రూపాయలు చెల్లించారు.
ఇద్దరిని ష్యూరిటీగా పెట్టారు.రేవంత్ రెడ్డి బెయిల్ దుర్వినియోగం చేసినా, నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఆ ఇద్దరిదే బాధ్యత.
వాదోపవాదాల అనంతరం రేవంత్ బెయిల్ ఇవ్వొచ్చని న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు.ఆయనకు బెయిల్ ఇచ్చినందువల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం లేదని, ఇతరత్రా నష్టం లేదని న్యాయమూర్తి ఇదివరకే భావించారు.
మంగళవారం తప్పనిసరిగా బెయిల్ వస్తుందని రేవంత్ తరపు న్యాయవాది దీనిపై విచారణ వాయిదావేసిన రోజే చెప్పారు.బెయిల్ ఇవ్వకూడదని ఏసీబీ వాదించినా అంత ప్రమాదకరమైన విషయం ఇందులో లేదన్నారు.
విజువల్్స, ఇతర ఆధారాలన్నీ ఏసీబీ దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి.కాబట్టి రేవంత్ బెయిల్పై బయటకు వచ్చినా ఏం చేయలేరు.
అందుకు అవకాశం కూడా లేదు.మొత్తం మీద నెల రోజుల తరువాత రేవంత్కు ఊరట లభించింది.
ఇక ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో….!
.