హైదరాబాద్లోని మియాపూర్ భూకుంభకోణం కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తుంటే…అధికార టీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది.ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.
కేశవరావుతో పాటు ఆయన కుమార్తె బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి పేర్లు బయటకు రావడంతో టీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్లయ్యింది.ఇది అక్కడ విపక్షాలకు పెద్ద అస్త్రంలా దొరకడంతో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి కెకె ఎలాంటి సపోర్ట్ కూడా లేదని వార్తలు వస్తున్నాయి
ఇదిలా ఉంటే ఈ భారీ భూకుంభకోణానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ఆధారాలతో బయటకు రానున్నాయి.
దీనిని బయటకు తీసుకువచ్చి, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం రేవంత్ టార్గెట్ మొత్తం ఈ అంశంమీదే ఉంది.
ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ కన్నా రేవంత్ రెడ్డే ముందున్నారు.
అయితే ఈ ఇష్యూ పూర్తి ఆధారాలతో సహా బయటకు వస్తే చాలా మంది బడా బాబులు గుట్టు కూడా రట్టు అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
దీంతో ఇప్పుడు రేవంత్ను సైలెంట్ చేసేందుకు ఓ ప్రధాన ప్రతిక ఎండీ బ్రోకర్గా మారి రేవంత్తో రాయభేరం మొదలు పెట్టినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా లీక్ అయ్యింది.మాట మాట్లాడితే దమ్మున్న పత్రిక, దమ్మున్న ఛానెల్ అంటూ గొప్పలు పోయే సదరు పత్రిక ఎండీ ఈ ఇష్యూలో రేవంత్ను సైలెంట్ చేసేందుకు రాయ భేరం మొదలెట్టాడట.
గతంలో కేసీఆర్ను విబేధించిన సదరు మీడియాధినేత ఇప్పుడు తిరిగి ఆయనకు దగ్గరవుతున్నారు.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ మెప్పుపొందేందుకు ఇప్పుడు బ్రోకర్గా మారారని టాక్.అయితే సదరు మీడియాధినేత ప్రతిపాదనకు రేవంత్ నో చెప్పినట్టు సమాచారం.గతంలో ఓటుకు నోటు కేసులో తనను ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని తాను అంత సులువుగా ఎలా మర్చిపోతానని రేవంత్ అన్నట్టు తెలుస్తోంది
ఓవరాల్గా మియాపూర్ స్కామ్ రాజకీయంగా రాబోయే రోజుల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది.
రేవంత్ రెడ్డి మాత్రం ఈ భూ స్కామ్ విషయంలో నేరుగా సీఎం ఫ్యామిలీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.దీనికి సంబంధించి రేవంత్ దగ్గర పలు ఆధారాలు ఉన్నట్లు సమాచారం.
అవి బయటకు వస్తే కేసీఆర్కు మరిన్ని షాకులు తప్పవు.