తెలుగుదేశం ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఆదివారం మహానాడు మూడో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… సాగు నీటి ప్రోజక్టులు, రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాలు, ఇలా అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపేందుకు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తు, నీతివంతమైన పాలన అందిస్తున్న తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు
అవినీతి పునాదులపై పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఏప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని అధ్యక్షుడు జగన్ ప్రతి విషయంపై అనవసర రాధ్దాంతం సృష్టించి, తన ప్రతిక, టివిలలో కారుకూతలు రాయిస్తున్నాడని, వాటిని జనం నమ్మాల్సిన పనే లేదన్నారు.దీనికి తోడుగా గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేయటంతో
చెల్లని రూపాయి గా మారిన కాంగ్రెస్ పార్టీకి నేతలకు బుద్ధి రా లేదని, జనం నుంచి శాశ్వతంగా తరిమేసేలా చూడాలని పిలుపు నిచ్చారు
చిన్న పామునయినా.
పెద్ద కర్రతో కొట్టినట్టే….విపక్ష పార్టీలు చేసే విమర్శలను పార్టీ నేతలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు
.