పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండో భార్యగా వివాహ జీవితం కొనసాగించిన రేణూ దేశాయ్ కొన్ని మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.వీరిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు.
అయితే ఈ మధ్య కాలంలో రేణుదేశాయ్ కాస్త సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ సందడి గా కనబడుతున్నారు.ఆవిడ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు, అలాగే ఆమె చెప్పే కవితలకు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
ఫోటోగ్రఫీలో స్పెషలిస్ట్ కాకపోయినా సరే ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లా ఆవిడ తన కెమెరాలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటిని ఆవిడ ఫ్యాన్స్ కు షేర్ చేస్తూనే ఉంటుంది.మామూలుగా ఎప్పుడూ సరదాగానే ఉంటూ అందరినీ నవ్విస్తూనే ఉంటుంది.
అప్పుడప్పుడు ఈవిడ సోషల్ మీడియాలో లైవ్ లోకి వస్తూ ఆ సమయంలోనే నెటిజన్స్ వేసే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు ఇస్తుంది.ఆ సమయంలో తన వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా సమాజంలో జరిగే కొన్ని అసమానతలపై కూడా కామెంట్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా హథ్రస్ లో జరిగిన అమ్మాయి సంఘటన పై కూడా ఆమె స్పందిస్తూ దేశంలో రాజకీయ నాయకులను, అలాగే మీడియా ను ఆవిడ ప్రశ్నించింది.ఈ విషయంపై ఆవిడ రెండు రోజుల వరకు చర్చించిన ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు.
ఇందులో భాగంగానే చట్టాలు ఎప్పుడు మారుతాయని, మార్పు ఎప్పుడు వస్తుందని ఆవిడ ప్రశ్నించంచింది.
ఇక అసలు విషయం చూస్తే తాజాగా రేణు దేశాయ్ అదిరిపోయే ఫోటో షూట్ ను చేసింది.
ఈ ఫొటోషూట్ లోని ఫోటోలను చూస్తే ఆవిడ మళ్ళీ ఓ పది నుండి పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లుగా కనబడుతోంది.అయితే తాజాగా రేణు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
తాను ఆకలితో ఉన్నప్పుడు తనని ఎవరు గెలకవద్దని వార్నింగ్ ఇచ్చింది.