సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారి చిత్రానికి సన్నాహాలన్ని జరుగుతున్నాయి.మహేష్ బాబు మరో రెండురోజుల్లో హైదరాబాద్ తిరిగొచ్చాక, స్క్రిప్టుకి సంబంధించిన ఫైనల్ చర్చలు జరుగుతాయి.
ఆ తరువాత కొద్దిపాటి విరామం తీసుకోని జులై 15న ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారు.మహేష్ బాబు – పరిణీతి చోప్రా మీద చిత్రీకరించే ఓ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోలో అల్రెడి సెట్ వర్క్ మొదలైపోయింది.
ఇక ఈ చిత్ర నిర్మాణంలో ఎన్వి ప్రసాద్, ఠాగూర్ మధులతో పాటు, రిలయన్స్, ఫాక్స్ స్టార్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పాలుపంచుకుంటాయని, స్వయంగా మహేష్ బాబు, మురుగదాస్ కూడా నిర్మాణంలో భాగం కావొచ్చని ఇప్పటికే తెలుగుస్టాప్ రిపోర్ట్ చేసింది.ఫిలింనగర్ లో కొత్తగా వినబడుతున్న వార్త ఏంటంటే, ఈ చిత్ర బడ్జెట్లో 50 కోట్ల దాకా పెట్టుబడి రిలయన్స్ సంస్థ వారు ఫైనాన్స్ రూపంలో సమకూరుస్తున్నారట.
అయితే ఈ ఫైనాన్స్ కి సంబంధించిన మిగితా విషయాలు, ఏ నిర్మాత ఎంత పెట్టుబడి పెడతాడు అనే సమాచారం మాత్రం బయటకి రావట్లేదు
.