సుధీర్బాబు కెరీర్లో మొదటి సక్సెస్ ‘ప్రేమ కథాచిత్రమ్’.ఈ సినిమా తర్వాత నందితతో కలిసి చేసిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నాయి.ఆడి విడుదల అయ్యి కూడా చాలా కాలం అయ్యింది.
అయితే ఈ సినిమా మాత్రం ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎందుకో వెనకాడుతోంది.ఈ సినిమా కంటే ఏడు ఎనకల ప్రారంభం అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం, ఆడియో విడుదల అవ్వడం, సినిమా కూడా విడుదల అవ్వడం జరిగి పోయింది.
ప్రేమికుల రోజున విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా ఇప్పటికి అయినా విడుదల అవుతుందో చూడాలి.ఇప్పటి వరకు ఈ సినిమాను ‘మోసగాళ్లకు మోసగాడు’ కోసం వాయిదా వేశారేమో అనే అనుమానాలు వున్నాయి.
మరి ఇప్పుడు ఆ సినిమా కూడా విడుదల అయ్యింది.మరి ఇప్పుడు అయినా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా విడుదల అవుతుందో చూడాలి.
ఈ సినిమాలో పలువురు యువ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్బాబు ఈ సినిమాలో కనిపిస్తాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత సుదీర్బాబు, నందిత కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.