సాయి ధరం తేజ్ హీరో అంటే హీరోయిన్ గా రేజీనా అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు.అలా ఉంది వీరిద్దరి మధ్యనా విషయం.
దీన్ని ఆసరాగా తీసుకుని అనేక గాసిప్ లు కూడా లేస్తున్నాయి లెండి అది వేరే విషయం.మళ్ళీ వీరిద్దరి వ్యవహారం కొత్త గుస గుస లకి దారు తీస్తుండడం వింతగా ఉంది.
సాయి ధరం తేజ్ తరఫున రేజీనా మరొక సారి నటించబోతూ ఉండడం ఇక్కడ కొత్త విషయం.
గోపీ చంద్ మలినేని డైరెక్షన్ లో సాయి చెయ్యబోతున్న సినిమాకి ఇద్దరు హీరోయిన్ లు కావాలని చూస్తున్నారు నిర్మాతలు.
సో ఒక హీరోయిన్ గా లావణ్య ని ఫిక్స్ అయ్యారు సెకండ్ హీరోయిన్ గా రేజీనా ఆల్మోస్ట్ కన్ఫారం అంటున్నారు.దాంతో ఆమె కాల్ షీట్లు, రేట్లు వగైరా లెక్కల్లో నిర్మాత, దర్శకుడు బిజీ అయ్యారు.
మొత్తానికి మెగా మేనల్లుడు హీరోయిన్ల ఎంపికలో బాగానే టాలెంట్ చూపిస్తున్నాడు.