టాలీవుడ్కు సినిమా ఇండస్ట్రీకి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.టాలీవుడ్ నుంచి ఎంతోమంది ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు.
ఇదే క్రమంలో టాలీవుడ్లో స్టార్లుగా వెలుగొందిన వారితో పాటు వారి వారసులు సైతం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్లో బలమైన ఫ్యామిలీగా ఉన్న మంచు ఫ్యామిలీకి సైతం పాలిటిక్స్తో మంచి అవినాభావ సంబంధం ఉంది.
మంచు మోహన్బాబు గతంలోనే టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.ఆయనకు అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఇటు వైసీపీ అధినేత జగన్తో చాలా దగ్గరి బంధుత్వం ఉంది.
చంద్రబాబు మోహన్బాబుకు మేనత్త కొడుకు వరుస అవుతాడు.ఇక జగన్ విషయానికి వస్తే జగన్ చిన్నాన్న కుమార్తె వెరోనికానే విష్ణు భార్య.
అలా జగన్ మోహన్బాబుకు వరుసకు అల్లుడు అవుతాడు.
ఈ క్రమంలోనే మోహన్బాబు ఫ్యామిలీ గత కొద్ది రోజులుగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఆ ఫ్యామిలీ వైసీపీలోకి వెళుతుందని, మోహన్బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తుందని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.చంద్రగిరితో పాటు శ్రీకాళహస్తిపై కూడా మోహన్బాబు ఫ్యామిలీ కన్నేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే లేటెస్ట్ టాక్ ఏంటంటే మంచు లక్ష్మి వైసీపీలోకి వెళ్లడం లేదట.
మంచు లక్ష్మి బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
స్థానిక పార్టీల కన్నా జాతీయ పార్టీలే ఉత్తమమని భావించిన మంచులక్ష్మి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక బీజేపీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే చిన్నపాటి సెలబ్రిటీ తమ పార్టీలో వచ్చినా చేర్చేసుకుంటోంది.ఈ క్రమంలోనే మంచు మోహన్బాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీలో చేరి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చే విషయమై మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.