ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి! తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాల్గొనడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
కొన్నేళ్లుగా బావ చంద్రబాబుతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటుడచేసిన సమావేశానికి హాజరవడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న హరికృష్ణ.ఇప్పుడు సడన్గా పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనడం వెనుక కారణమేంటి? ఇక మళ్లీ నారా- నందమూరి కుటుంబాల మధ్య దూరం దగ్గరయినట్టేనా? అనే సందేహాలు అందరినీ వేధిస్తున్నాయి.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ అధినేతకు చుక్కలు చూపిస్తున్నాయి.ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.మరో పక్క నాయకుల మధ్య విభేదాలు, ఆగ్రహ జ్వాలలు, నిరసనలు ఇలా.ఒక్కటేమిటి అన్నీ తలనొప్పిని తెచ్చేవే! అభ్యర్థుల ఎంపికే ప్రధాన ఎజెండాగా విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు.అయితే దీనికి హరికృష్ణ రావడం.అటు చంద్రబాబుతో పాటు నాయకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.
అసలు ఈ సమావేశానికి హరికృష్ణ వస్తారన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదట.ఈ సమావేశానికి ఆయన హాజరవుతారని చంద్రబాబుతో సహా ఎవ్వరూ ఊహించలేదట.2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక హరికృష్ణ, చంద్రబాబు ల మధ్య దూరం బాగా పెరిగింది.అప్పుడప్పుడూ తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తపరుస్తున్నారు.
మరి ఇప్పుడు ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడి హోదాలో ఆయన ఈ భేటీకి హాజరయ్యారు.దీనినే ఆసరా చేసుకుని హరికృష్ణ ఈ సమావేశానికి హాజరై బాబు అండ్ కోకు షాకిచ్చినట్లు సమాచారం.
పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారనేది ప్రస్తుతానికి సస్పెన్స్! ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించారు.ఈ నేపథ్యంలో హరికృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
దీంతో చంద్రబాబు, హరికృష్ణ ల మధ్య పాత స్నేహం చిగురించిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.మరి ఇదే నిజమైతే.
హరికృష్ణకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా ఆశ్చర్యం కలగకమానదు! మరి వీరిద్దరకూ కలిసి పనిచేస్తే పార్టీకి నిజంగా బలం వచ్చినట్టే!! ఏం జరుగుతుందో వేచి చూద్దాం!!
.