మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘లోఫర్’.ఈ సినిమా ఆడియోను ఈ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఆడియోకు చిరంజీవిని ఆహ్వానించాలని నాగబాబు అనుకున్నాడు.అనుకున్నదే తడువుగా చిరంజీవి వద్దకు వెళ్లి నాగబాబు ‘లోఫర్’ ఆడియోకు రావాల్సిందిగా అన్నను కోరాడు.
అయితే చిరంజీవి మాత్రం ‘లోఫర్’ ఆడియో విడుదల కార్యక్రమంకు హాజరు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.కారణం ఈ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాధ్ అవ్వడం వల్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి 150వ సినిమాను పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది.ముందు స్టోరీ లైన్ బాగానే చెప్పినా స్క్రిప్ట్ను పూర్తి పక్కాగా పూర్తి చేయడంలో దర్శకుడు పూరి విఫలం అయ్యాడు.
దాంతో చిరు తన 150వ సినిమా నుండి పూరిని తప్పించాడు.దాంతో పూరి మీడియా ముందు చిరంజీవిపై అసహనం వ్యక్తం చేశాడు.
అది చిరంజీవికి కోపం తెప్పించిందని అంటున్నారు.అందుకే పూరితో స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకే చిరంజీవి ‘లోఫర్’ ఆడియో విడుదలకు రావట్లేదు అంటూ సినీ వర్గాల్లో కొందరు అంటున్నారు.
చిరంజీవి రాక పోవడంతో ఈ ఆడియోకు రెబల్ స్టార్ ప్రభాస్ను ముఖ్య అతిథిగా పూరి ఆహ్వానించాడు.ప్రభాస్ చేతుల మీదుగా ‘లోఫర్’ ఆడియో విడుదల అవ్వబోతుంది.
డిసెంబర్ చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.