మాస్ మహరాజ్ రవితేజ బెంగాల్ టైగర్ తర్వాత అనుకోకుండా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.దిల్ రాజుతో సినిమా విషయంలో రెమ్యునరేషన్ గొడవల వల్ల ఆగిపోగా మళ్లీ వేరే సినిమాలేవి రవితేజ ఎనౌన్స్ చేయలేదు.
ప్రస్తుతం బాబి డైరక్షన్లో ఓ సినిమా కమిట్ అయిన రవితేజ మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు.నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా విక్రం సిరి డైరెక్ట్ చేస్తున్నాడు.
కొంచం ఇష్టం కొంచం కష్టం, రేసుగుర్రం సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన విక్రం సిరికు రవితేజ దర్శకుడిగా అవకాశం ఇస్తున్నాడు.
వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను మరోసారి మాస్ మహరాజ్ రేంజ్ తెలిసేలా సినిమా తీస్తున్నారట.
తన నిర్మాణ సంస్థలో రవితేజతో సినిమా తీయడం గురించి చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు బుజ్జి.రవితేజ మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని.
కొద్దిరోజుల్లో స్టార్ట్ అవనున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడిస్తామని నిర్మాత బుజ్జి అన్నారు.
.