మాస్ మహారాజ రవితేజ తనకున్న మాస్ పవర్ మరోసారి నిరూపించుకున్నాడు.నిన్నటిదాకా సైలెంట్ గా ఉన్న బెంగాల్ టైగర్ ఈరోజు ఒక్కసారిగా గర్జించింది.
తొలిరోజు ఉదయం ఆటలు అదోరకంగా మొదలయ్యాయి.నైజాం, నెల్లూరు, వైజాగ్, సీడెడ్ తేడా లేకుండా అన్ని ట్రేడ్ ఏరియాల్లో మాస్ మహారాజ భారి ఓపెనింగ్స్ రాబడుతున్నాడు.
ఇక ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ఆటలు పూర్తయ్యాయి.టాక్ కూడా బాగుంది.
చాలా రోజుల తరువాత మాంచి నాటుగా ఉన్న మాస్ మూవీ అంటున్నారు.హైదరాబాద్, భీమవరంలో మధ్యాహ్నం ఆటనుంచి థియేటర్లు పెంచుతున్నారని వార్తలు అందాయి.
ఇదే ఊపు కొనసాగితే సంపత్ నందికి ఇది వరుసగా మూడో హిట్ అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 1000 కి పైగా థియేటర్లలో ఈ రోజు విడుదలైంది బెంగాల్ టైగర్.
తమన్నా, రాశీఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ మోహన్ నిర్మించారు.