‘బాహుబలి’కి చెందిన మరో బుల్లి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.20 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో టాప్లో ట్రేడ్ అయ్యేలా చేస్తోంది.రమ్యకృష్ణ ప్రధానంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఎప్పటిలాగే అంచనాలను మరింతగా పెంచుతుంది.ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు శివగామి పాత్ర గురించి మరీ మరీ చెబుతూ వచ్చారు.మమతల తల్లి పాటలో శివగామి పాత్ర కాస్త చూపించారు.తాజాగా ఈ ట్రైలర్లో పూర్తి స్థాయి శివగామి పాత్రపై ప్రేక్షకుల్లో ఒక క్లారిటీ వచ్చేలా చేశారు.
‘వీరి తిరుగుబాటుతో మహిస్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగేయ్.
’ అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మారుమ్రోగి పోతుంది.సినిమాలో శివగామి పాత్ర ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది.
నెగటివ్ రోల్లా కనిపిస్తున్నప్పటికి కొందరు మాత్రం శివగామి పాజిటివ్ రోల్లోనే కనిపించనుంది అంటూ విశ్లేషిస్తున్నారు.మొత్తానికి హీరో, హీరోయిన్స్, విలన్ స్థాయిలో రమ్యకృష్ణకు ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉందని అనిపిస్తోంది.
ఈ సినిమా మరో ఆరు రోజుల్లో అంటే ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.