టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ సినిమా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం భారీగా చేస్తున్నారు.
ఈ సినిమా విడుదల సమయంలో ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ మీడియా మ్యాన్, నిర్మాత, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
తన సినిమాలను మాత్రమే అత్యధికంగా ఈనాడులో ప్రమోట్ చేసే రామోజీ రావు ‘బాహుబలి’ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తుండటంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
మీడియా వర్గాల్లో వ్యక్తం అయిన అనుమానాలే నిజం అని తేలిపోయింది.
తాజాగా ఈ సినిమా బడ్జెట్లో దాదాపు 60 శాతం ఫైనాన్స్ను రామోజీ అందజేసినట్లుగా తెలుస్తోంది.అనధికారికంగా ఈ సినిమాకు రామోజీ కూడా ఒక నిర్మాత అంటూ చెబుతున్నారు.
శోభు యార్లగడ్డతో పాటు ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.రాఘవేంద్ర రావు ఈ సినిమా నిర్మాతల్లో ఒక్కరు అని ఇప్పటికే అందరికి తెలిసిన విషయం.
తాజాగా రామోజీ రావు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్ల రూపాయలతో సెట్టింగ్లు వేయించారు.
అవన్ని కూడా భాగస్వామ్యంతోనే అని తెలుస్తోంది.అందుకే ఈనాడు పేపర్లో గత కొన్ని రోజులుగా ‘బాహుబలి’ని ఆకాశానికి ఎత్తేలా కథనాలు, ఇంటర్వ్యూలు వస్తున్నాయి.