ఎనర్జిటిక్ హీరో రామ్, లక్కీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పండగ చేస్కో’.ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.మొత్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు యావరేజ్ సినిమాగా పర్వాలేదు అంటూ తేల్చి చెప్పారు.
విమర్శకులు సైతం ఒక్కసారి చూడదగ్గ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటూ తేల్చేశారు.దాంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని నిర్మాత టెన్షన్ పడ్డాడు.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మొదటి రోజు కలెక్షన్స్ నిర్మాతకు సంతోషాన్ని కలిగించాయని అంటున్నారు.
యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.1 కోట్ల షేర్ను వసూళ్లు చేసినట్లుగా చెబుతున్నారు.చిన్న హీరో ఇంత స్థాయిలో షేర్ వసూళ్లు చేయడం అంటే అది పెద్ద విషయమే అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.
ఇవే కలెక్షన్స్ వారం రోజులు కొనసాగితే నిర్మాత సేఫ్ అయినట్లే అని అంటున్నారు.సినిమా విడుదలకు ముందు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు.
రామ్కు ఈ సినిమా వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది.