వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మంచు మనోజ్తో ‘ఎటాక్’ అనే సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను మొదట ‘గొలుసు’ టైటిల్తో తెరకెక్కించాలని భావించారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథానుసారం ‘ఎటాక్’ అనే టైటిల్ సూట్ అవుతుందని మార్చినట్లుగా తెలుస్తోంది.గత కొంత కాలంగా వరుసగా చిన్న బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వస్తోన్న వర్మ ఈ సినిమాకు భారీ బడ్జెట్ను కేటాయించినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రలో జగపతిబాబు మరియు వడ్డే నవీన్లు నటిస్తున్నారు.
వీరిద్దరు కూడా ఈ సినిమాలో మంచు హీరోకు అపోజిషన్గా కనిపించనున్నట్లుగా చెబుతున్నారు.వడ్డె నవీన్ ఈ సినిమా ద్వారా మొదటి సారి విలన్గా తెలుగు ప్రేక్షకు ముందుకు రాబోతున్నాడు.
హీరోగా సరైన సక్సెస్లను అందుకోలేక పోయిన ఈ హీరో విలన్గా అయినా సక్సెస్ను సాధిస్తాడో చూడాలి.ఈ సినిమా వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
దూల్పేట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.