ఆపదలో ఉన్న వారిని సెలబ్రెటీలు ఆదుకున్నప్పుడు, వారి మార్గాన సాధారణ జనాలు కూడా నడిచి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తారు.తాజాగా నేపాల్లో జరిగిన ఘోర కలికి యావత్ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.
నేపాల్లో వచ్చిన భూకంపానికి 5 వేల మందికి పైగా చనిపోయారు అనే విషయం తెల్సిందే.ఈ సమయంలో నేపాల్ ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యతపై అందరిపై ఉంది.
ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేసి, తమ అభిమానులను కూడా ఏదో కొంత అయినా సాయం చేయాల్సిందిగా పిలుపు ఇవ్వాల్సి ఉంది.కాని ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి రామ్ చరణ్ తప్ప మరెవ్వరు కూడా పెద్దగా స్పందించలేదు.
రామ్ చరణ్ ఇప్పటికే లక్షల విలువైన మెడికల్ కిట్లను నేపాల్కు పంపే పనిలో ఉన్నాడు.అపోలో ఫార్మసి నుండే కాకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుండి కూడా నేపాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు సాయం అందించేందుకు చరణ్ నడుం భిగించాడు.
చరణ్ ముందు అడుగును ఆయన అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు.సెలబ్రెటీలు అంతా కూడా చరణ్కు మళ్లే ముందుకు వచ్చి సాయాన్ని ప్రకటించాల్సిందిగా వారి వారి అభిమానులు కోరుతున్నారు.
చరణ్ స్పందించి, సాయం ప్రకటించి ఇన్నాళ్లయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్పందిచరేం అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికి అయినా హీరోలు, హీరోయిన్స్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు.