మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత ఇన్నాళ్లకు మరో సినిమాను ప్రారంభించాడు.గోవిందుడు సినిమా విడుదల అవ్వగానే శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ సినిమా మొదలు కావాల్సి ఉంది.
కాని శ్రీనువైట్ల ‘ఆగడు’ ఫ్లాప్తో స్క్రిప్ట్లో పూర్తి మార్పులు చేయడం జరిగింది.మళ్లీ కొత్త స్క్రిప్ట్ను రెడీ చేసే వరకు ఇంత లేట్ అయ్యింది.
లేట్ అయినా లేటెస్ట్గా ఈ సినిమా ఉంటుందని సినీ యూనిట్ సభ్యులు అంటున్నారు.నిన్న లాంచనంగా ప్రారంభం అయిన ఈ సినిమా మెగా అభిమానుల్లో ఇప్పటికే అంచనాలను తారా స్థాయిలో పెంచింది.
కోన వెంకట్ మరియు గోపీమోహన్లు కలిసి రెడీ చేసిన స్క్రిప్ట్ను శ్రీనువైట్ల డైరెక్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమాకు ‘నా పేరే రాజు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.
‘బాద్షా’, ‘ఆగడు’ సినిమాల ఫ్లాప్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.మరో హీరోయిన్గా కృతి కర్బంద నటిస్తున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
తమిళ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.