మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తర్వాత చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చేస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.కాని ఆయన మాత్రం ఇప్పటి వరకు కూడా తన తర్వాత చిత్రాన్ని ప్రారంభించింది లేదు.
‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం విడుదలై దాదాపుగా నాలుగు నెలలు పూర్తి కావచ్చింది.అయినా కూడా ఇప్పటి వరకు చరణ్ మరో సినిమా మొదలు పెట్టకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం ఈనెలలోనే ప్రారంభం కాబోతుందని మొదట ప్రచారం జరిగింది.కాని జనవరి నెల మరో రోజుతో పూర్తి కాబోతుంది.
అయినా ఇప్పటి వరకు కూడా ప్రారంభం అయ్యింది లేదు.
శ్రీనువైట్లతో చరణ్ సినిమా అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభం కావాల్సి ఉంది.
కాని శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘ఆగడు’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో సినిమా లేట్ అవుతూ వస్తోంది.కొత్త స్క్రిప్ట్ తయారికి ఇంత సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
శ్రీనువైట్ల తన గత చిత్రాల్లా కాకుండా కొత్తగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ క్రమంలోనే ఈ లేట్ అని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ను అధికారికంగా వచ్చే నెలలో ప్రారంభించి, రెగ్యులర్ షూటింగ్ను ఉగాది తర్వాత మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.మరింత ఆలస్యం అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు.