పూరి చెప్పిన కథలో సెకండాఫ్ నచ్చలేదని మెగాస్టార్ మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి గారు నాకు చెప్పకుండా, మీడియాకు చెప్పారు.
స్వయంగా నాకే చెప్పుంటే, మార్పులు చేసేవాడ్ని అని పూరి వాదించారు.
దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ “నాన్నగారి సినిమా ని కథల కోరతేమి లేదు.వందల కథలు విన్నాము ఏడాది నుంచి.151, 152, 153 సినిమాల స్ర్కిప్టులు రెడీగా ఉన్నాయి.వాటిని చేయడానికి శ్రీను వైట్ల, వినాయక్ రెడీగా ఉన్నారు.వాటికి నిర్మాతలు కూడా ఉన్నారు.కానీ 150వ సినిమాదే సమస్య.ఏదేమైనా కచ్చితంగా జనవరిలో దాని షూటింగ్ మొదలవుతుంది.
దసరా లోపలే నాన్న 150వ సినిమా డైరెక్టర్ ఎవరనేది ప్రకటిస్తాం.పూరి జగన్నాథ్ చెప్పిన ఫస్టాఫ్ కథ నాన్నకు బాగా నచ్చింది.
సెకండాఫ్ నచ్చలేదు.ఆ సంగతి ఆయనకే స్పష్టంగా చెప్పాం.
ఆయన వరుణ్తో చేస్తున్న ‘లోఫర్’తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనను డిస్టర్బ్ చేయదలచుకోలేదు.ఆయనకు కూడా కథమీద కూర్చోడానికి టైమ్ ఉండదు.
ఆయన విషయంలో మేం ఫేర్గానే ఉన్నాం.నాన్నగారు తనతో చెప్పలేదని ఎందుకన్నారో తెలీదు.” అంటూ తమ వైపు తప్పు లేదని క్లారిటి ఇచ్చాడు చరణ్.
ఇందులో ఎవరిది నిజమో, ఎవరిది అబద్ధమో !
.