ఎంతైనా చిరంజీవి చిరుత పులి లాంటి కొడుకుని కన్నారు .అటు బాక్సాఫీస్ వద్ద .
ఇటు నిజ జీవితంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్ .ఇంతకీ చరణ్ ఏం చేసాడో తెలుసా ? ఓసారి మ్యాటర్ మొత్తం చదవండి.
పూరి జగన్నాధ్ చెప్పిన కథ మెచ్చని మెగాస్టార్ , ఆ విషయాన్ని పురితో డైరెక్ట్ గా కాకుండా మీడియాలో చెప్పిన విషయం తెలిసిందే .పూరి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ స్వయంగా తనకే చెప్పుంటే కథలో మార్పులు చేసేవాడ్ని, ఇప్పుడు ఆయన వల్ల నాకు రెండు కోట్ల నష్టం వచ్చింది అని భోరుమన్నాడు .జరిగిందంతా చుసిన రామ్ చరణ్ నిన్న పురి ఇంటికి వెళ్ళాడట.
వెళ్లి మీడియా మాటలు పట్టించుకోవద్దు, మీరంటే నాన్నకి చాలా ఇష్టం, మనసులో ఏమి పెట్టుకోవద్దు అని పురిని బుజ్జగించి మ్యాటర్ సెటిల్ చేసి వచ్చాడట !
ఎంత వివేకం చరణ్ ది .ఇప్పుడైనా ఒప్పుకుంటారా .పులి కడుపునా పులే పుడుతుంది.