చరణ్‌ రెండు ఇస్తానన్నాడు!

రామ్‌చరణ్‌ ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ప్రారంభించని విషయం తెల్సిందే.శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చరణ్‌ గత సంవత్సరం అక్టోబర్‌ లేదా నవంబర్‌లోనే సినిమాను ప్రారంభించాల్సి ఉంది.

 Ram Charan Planning To Release Two Movies-TeluguStop.com

కాని శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కి విడుదలైన ‘ఆగడు’ అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.దాంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు చరణ్‌ కాస్త ఆలోచించాడు.

అయితే స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత నటించేందుకు ఒప్పుకున్నాడు.

మొత్తంగా చరణ్‌ తర్వాత సినిమాకు చాలా ఆలస్యం అయ్యింది.

దాంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.అయితే వారిని సంతోష పెట్టేందుకు చరణ్‌ తాజాగా ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు.

నేడు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న చరణ్‌ తాను ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ ప్రకటించాడు.ఈ రెండు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేయనున్నామని పేర్కొన్నాడు.

ఆ రెండు సినిమాల్లో మొదటిది శ్రీనువైట్ల దర్శకత్వంలో కాగా రెండవ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఆ రెండవ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ఫిల్మ్‌ సర్కిల్స్‌ ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube