బ్రూస్ లీ ఘోర పరాజయం తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఊరట పొందేందుకు విదేశాలు చుట్టివచ్చాడు.సినిమా మనుషుల మధ్య ఉంటే ఒకే విషయాన్నీ పదే పదే గుర్తు చేస్తారని కొన్ని రోజులు హాలిడే ట్రిప్ కి వెళ్ళిన చరణ్ ఇప్పుడు మళ్లి పనిలో పడ్డాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ బ్లాక్బస్టర్ తని ఒరువన్ ని రిమేక్ చేయనున్న చరణ్ ఆ దిశగా స్టోరి సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు.
నిజానికి ఈ చిత్రాన్ని దసరాకే మొదలుపెడతామన్నారు.
కాని బ్రూస్ లీ వలన మూడ్ బాగాలేని చరణ్ కొన్ని రోజులు విశ్రాంతి అడగడంతో వాయిదా వేసారు.ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టేసారు.
జనవరి 16న పూజకార్యక్రమాలతో చరణ్ నూతనచిత్రం ప్రారంభం కానుంది.
ఇందులో విలన్ గా ఎవరు నటిస్తారు అనేది ఇంకా ఖరారు కాలేదు.
అరవింద్ స్వామి చెస్తాడని కొందరు, చేయట్లేదని కొందరు చెప్తున్నారు.విలన్, హీరోయిన్, ఇతర నటులు, సాంకేతికవర్గం, అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.