మెగాపవర్స్టార్ రామ్ చరణ్ తన తల్లి కలను నెరవేర్చేందుకు అమర్నాధ్ యాత్రకు వెళ్లి వచ్చాడు.చరణ్ తల్లి సురేఖ గారికి చాలా కాలంగా అమర్నాధ్ యాత్రకు వెళ్లాలనే కోరిక ఉంది.
ఆ కోరికను చరణ్ నెరవేర్చాడు.తాజాగా హిమాలయాల్లో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాధ్కు చేరుకోవాలంటే ఎంతో కష్టాలు పడాల్సి ఉంటుంది.
ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని చరణ్ అమర్నాధ్కు చేరుకుని శివున్ని దర్శించుకుని వచ్చాడు.తాజాగా అమర్నాధ్ విశేషాలను చరణ్ షోషల్ మీడియాలో పంచుకున్నాడు.
అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు.
ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.
‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్నందుకు తనకు గర్వంగా ఉంది అంటూ చరణ్ ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు.
ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేలా ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.