వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా తీసిన రెండు సినిమాలతో ఎక్స్ ప్రెస్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధి ఇదవరకే మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు ఓ కథ వినిపించాడని తెలిసిందే.అయితే లైన్ నచ్చిన చరణ్ దాన్ని డెవెలప్ చేయమన్నాడట.
ప్రస్తుతం ధ్రువ సినిమా షూట్లో బిజీగా ఉన్న చెర్రి మేర్లపాక గాంధితో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడట.ధ్రువ తర్వాత సుకుమార్ లైన్లో ఉండగా ఆ తర్వాత సినిమా మేర్లపాక గాంధి డైరక్షన్లో ఉంటుందట.
ఓ రకంగా ఎక్స్ ప్రెస్ డైరక్టర్ కు ఇదో లక్కీ ఛాన్స్ అని చెప్పాలి.రెండు సినిమాలతోనే స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న గాంధి సినిమాను కూడా కొత్తగా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నాడట.
ఇక సినిమా కథ కూడా లవ్ స్టోరీ అని తెలుస్తుంది.ఆరెంజ్ లవ్ స్టోరీతో దెబ్బ తిన్న చెర్రి పకడ్బందీ స్క్రీన్ ప్లేతో వచ్చిన మేర్లపాక గాంధిని కాదనలేకపోయాడట.
సో మొత్తానికి యువ దర్శకుడికి అవకాశం ఇచ్చిన చరణ్ తన మంచి తనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.బ్రూస్ లీ ఫ్లాప్ తో స్టార్ హీరోల హిట్ రేసులో వెనుకపడ్డ చరణ్ ధ్రువ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని డిసైడ్ అయ్యాడు.
సురేందర్ రెడ్డి డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ అవుతుంది.
.