మెగా ఫ్యాన్స్ ‘బ్రూస్లీ’ చిత్రం కోసం భారీ అంచనాలు పెట్టుకుని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.తాజాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఆడియోను విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఆడియో విడుదల సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు.తాజాగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు.
చిత్రాన్ని ముందుగా అనుకున్న సమయానికి విడుదల చేయడం కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడి చిత్రాన్ని ముందుగా అనుకున్న సమయానికి పూర్తి చేశారు.
గత రెండు రోజులు రామ్ చరణ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్లు రోజులో 24 గంటలు షూటింగ్తోనే గడిపి అందరిని ఆశ్చర్యపర్చారు.చరణ్తో పాటు రకుల్ కూడా పడ్డ కష్టంకు తప్పకుండా మంచి ఫలితం వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.24 గంటల ఏకథాటి షూటింగ్తో బ్యాలన్స్ ఉన్న ఒక్క పాట కూడా పూర్తి అయ్యింది.దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ‘బ్రూస్లీ’ చిత్రానికి గుమ్మడి కాయ కొట్టారు.ఇక దసరా కానుకగా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.శ్రీనువైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన ఈ సినిమాను దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంలో చిరు గెస్ట్ రోల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.