చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ తెలుగు సినిమాలో పెద్ద తలకాయలే, అదే పెద్ద హీరోలు అని.బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరూ గట్టిగా రికార్డులు కొట్టగల ధీరులు.
అన్నికీ మించి ఇద్దరూ మంచి స్నేహితులు కూడా, రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు కూడా.అయితే ఇద్దరూ కలిసి ఒకే రోజున తమ తమ కొత్త సినిమాలని మొదలు పెట్టడం విశేషం.
ఇటు రాం చరణ్ తారక్ ఇద్దరూ కొత్త సినిమాలని మొదలు పెట్ట బోతున్నారు.తనీ ఒరువన్ రీమేక్ ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చరణ్ మొదలు పెడుతూ ఉండగా మరొక పక్క జనతా గ్యారేజీ అంటూ ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్ లో బిజీ అవుతున్నాడు.
సర్లే స్నేహితులు ఇద్దరూ ఒకే రోజు కొత్త సినిమాలను స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే.ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.
ఫిబ్రవరి 22 నుండి షూటింగ్ స్టార్ట్ చేసి.ఆగస్టు 12న రిలీజ్ ప్లాన్ చేశారు.
సర్లేండి.ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజున వస్తున్నారంటే.
ఖచ్చితంగా అది సూపరే.పోటీ ఏమో కాని.
మొన్న సంక్రాంతి టైములో పోటీ వచ్చినట్లు మాంచి రసవత్తరంగా ఉంటుంది సీన్ అంతా , నిజంగా జరిగిన మెగా ఫాన్స్ కీ నందమూరి ఫాన్స్ కీ మధ్యన పెద్ద పోటీ నే నెలకొంటుంది అంటున్నారు
.