టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ ఎవరు కూడా తెలుగు వారు కాదు అనే చేదు నిజం అందరికి తెలిసింది.ముంబై ముద్దుగుమ్మలు తెరపైన సందడి చేస్తుంటే వారికి మాటలను మాత్రం తెలుగు అమ్మాయిలు ఇస్తారు.
స్టార్ హీరోయిన్స్ తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నాలు అయితే చేస్తారు, కాని వారి పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోలేరు.ఒక వేళ వారు ఆసక్తిగా ఉన్నా కూడా దర్శక నిర్మాతలు, హీరోలు వారికి ఆ అవకాశం ఇవ్వరు.
ఎన్నో సినిమాల్లో నటించి, బాగా తెలుగు మాట్లాడటం వచ్చిన హీరోయిన్స్కు అప్పుడప్పుడు డబ్బింగ్ చెప్పుకునే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.కాని రకుల్ ప్రీత్ సింగ్కు చాలా తక్కువ సమయంలోనే డబ్బింగ్ చెప్పుకునే అవకాశం దక్కింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో రకుల్ పోషించిన పాత్ర స్వభావం రీత్యా ఆ పాత్రకు రకుల్తో డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడట.
తెలుగులో రకుల్ మంచిగా మాట్లాడుతుంది.దాంతో ఎన్టీఆర్ సైతం రకుల్తో డబ్బింగ్ చెప్పించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్లలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోబోతున్న హీరోయిన్ రకుల్ మాత్రమే.సమంత, కాజల్, శృతిహాసన్లు ఇప్పటి వరకు తమ గొంతును ప్రేక్షకులకు వినిపించింది లేదు.
ఆ క్రెడిట్ రకుల్కు దక్కబోతుంది.అందుకే రకుల్ అప్పుడే చాలా ముదిరిందని సినీ వర్గాల వారు అంటున్నారు.