‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత చరణ్ నటించబోతున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను మార్చి 5న అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇక మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్నట్లుగా దర్శకుడు శ్రీనువైట్ల ప్రకటించాడు.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్ మరియు గోపీ మోహన్లు స్క్రిప్ట్ను అందిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.
మొదట ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల చివరకు చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేశారు.
ఇప్పటికే ఎన్టీఆర్, సుకుమార్ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ను కొట్టేసిన ఈ అమ్మడు మెగా ఆఫర్ను దక్కించుకోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.ఈ సినిమాలో నటించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
ఈ సినిమాను మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి, అక్టోబర్ 15న విడుదల చేస్తామని నిర్మాత దానయ్య అంటున్నాడు.