సినిమా ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోతాయి.ఈ వారం ఎవరి సినిమా ఆడితే వారి రేంజ్ మారిపోతుంది.
సినిమా ఆడకపోతే కూడా రేంజ్ రివర్స్ లో మారుతుంది.అందుకే చాలా తక్కువ మంది హీరోయిన్ల కెరీర్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.
ఓ పదేళ్ళుగా హీరోగా రాణిస్తున్న హీరోలు ఎంతమంది అంటే కనీసం 15 పేర్లు చెబుతాం, మరి హీరోయిన్లు ఎంతమంది అంటే ? నాలుగైదు పేర్లు కూడా ఠక్కున గుర్తుకురావు.గ్లామర్ మీద ఆధారపడితే అంతే.
కొత్త అమ్మాయిలు రాగానే సీనియర్స్ ని పట్టించుకోరు దర్శకనిర్మాతలు.
ఇప్పుడు సాయి పల్లవి, నివేతా థామస్ కొత్త స్టార్ హీరోయిన్లు.
జెంటిల్మన్, నిన్నుకోరి వరుసగా రెండు హిట్ సినిమాల్లో నటించడమే కాదు, ఆ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది నివేతా.ఇక సాయిపల్లవి సంగతి సరే సరి.ఫిదాలో అందర్ని డామినేట్ చేసేసింది.ఇప్పుడు నివేతా ఎన్టీఆర్ తో జైలవకుశలో నటిస్తుండగా, సాయిపల్లవి నానితో MCA చేస్తోంది.
ఇంకొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. వీరు జోరు చూస్తోంటే త్వరలోనే రకుల్ ప్రీత్ రేంజ్ కి ఎదిగేలా ఉన్నారు.
మరి వీరి రాకతో రకుల్ ప్రీత్ కి అవకాశాలు తగ్గుతాయా ?
ఇదే ప్రశ్న రకుల్ ని అడిగితే “నేను నిన్నుకోరి చూసి నివేథాను అభినందించాను.సాయి పల్లవి గురించి చాలా వింటున్నాను, త్వరలో ఫిదా చూడాలి.
ఇండస్ట్రీలో ఎవరి పని వారిది, ఎవరికి ఉండే చోటు వారిది.నా సినిమాలు ఆడితే గోల్డెన్ లెగ్ అంటారు, ఆడకపోతే ఐరన్ లెగ్ అంటారు.
కాని నా పని నాదే.మీరేం రాసినా నాకు పని దొరుకుతుంది.
నాకు కొత్త హీరోయిన్లు వస్తున్నారన్న భయం లేదు” అంటూ జవాబిచ్చింది రకుల్.
ప్రస్తుతానికైతే రకుల్ కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు.11వ తేదిన జై జానకి నాయక వస్తుండగా, సెప్టెంబరులో భారీ చిత్రమైన మహేష్ బాబు “స్పైడర్” ఉంది.ఇటు తెలుగులోనే కాదు, అటు తమిళంలో కూడా పెద్ద సినిమాలు చేస్తోంది రకుల్.