రకుల్ ప్రీత్ సింగ్ పేరుకే ఉత్తరాది అమ్మాయి.కాని మానసికంగా తానో దక్షిణాది అమ్మాయి, అందులోనూ ఓ తెలుగమ్మాయి.
రకుల్ తనని తాను ఓ తెలుగమ్మాయిలానే చూస్తోంది.హైదరాబాద్ తన సొంతూరు అంటోంది.
అందుకే హైదరాబాద్ లోనే ఇల్లు తీసుకుంది, హైదరాబాద్ లోనే తన జిమ్ బిజినెస్ మొదలుపెట్టింది.తెలుగు నేర్చుకుంది, తెలుగులోనే మాట్లాడుతోంది.
ఇంకా చెప్పలంటే, రకుల్ తమిళంలో చేస్తున్న సినిమాల కోసం తమిళ డైలాగుల అర్థాలు తెలుగులోనే తెలిసుకుంటుందట.రకుల్ కోసం తెలుగులో మాట్లాడగిలిగే వారిని సెట్లో అసిస్టెంట్స్ గా పెట్టుకుంటున్నారు తమిళ దర్శకులు.
ఇక మీరే అర్థం చేసుకోండి రకుల్ కి తెలుగు అంటే, తెలుగు ప్రజలంటే ఎంత అభిమానమో.
రకుల్ పేరుకే బాలివుడ్ లో కెరీర్ మొదలుపెట్టింది.
కాని తను స్టార్ గా ఎదిగింది, నటిగా నిలబడింది మాత్రం తెలుగులోనే.అందుకే తెలుగు కోసం కొన్ని బాలివుడ్ సినిమాలు కూడా వదులుకుంది.
అలాగని బాలివుడ్ సినిమాలను ఇక పట్టించుకోదు అని కాదు, ప్రస్తుతం బాలివుడ్ ఓ పెద్ద సినిమానే కొట్టేసింది.నీరజ్ పాండే లాంటి అగ్రదర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి క్రేజీ హీరోతో చేస్తున్న “అయారీ”లో మన రకుల్ హీరోయిన్.
మరి పెద్ద ఛాన్స్ వచ్చింది కదా, ఇక బాలివుడ్ కి మకాం మార్చేస్తారా అంటే రకుల్ ని అడిగితే, అది జరగని పని, ఎప్పటికైనా తెలుగు సినిమాలే తన మొదటి ప్రాధాన్యత, కథ నచ్చితే ఏ భాషలో అయినా చేస్తాను కాని, తెలుగువారిని వదిలిపెట్టి ఇంకో చోటుకు షిఫ్ట్ అయ్యే అలోచనే లేదని, తెలుగు ప్రేక్షుకుల అభిమానాన్ని ఎప్పటికి వదులుకోనని బాలివుడ్ మీడియాకి గట్టి సమాధానం ఇచ్చింది రకుల్.ఈ జవాబులో నిజాయితీ ఉంది.
బాలివుడ్ మీడియాతో అలా సూటిగా చెప్పడం చిన్న విషయం కాదుగా.
ఇక రకుల్ సూపర్ స్టార్ మహేష్ తో, మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ చివరి దశల్లో ఉంది.
రెండు పాటలు, క్లయిమాక్స్ లో చిన్న భాగం మినహా స్పైడర్ షూట్ మొత్తం పూర్తయిపోయింది.సెప్టెంబరు చివర్లో ప్రపంచవ్యాప్తంగా భారిస్తాయిలో విడుదల కానుంది ఈ తెలుగు – తమిళ ద్విభాష చిత్రం.