లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ‘పండుగ చేస్కో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ అమ్మడు ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంది.
ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎక్స్పోజింగ్పై స్పందించింది.హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ అవసరం లేకున్నా చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
కథ, స్క్రీన్ప్లే అనుగునంగా దర్శకుడు చెప్పిన దారి ప్రకారం ఎక్స్పోజింగ్ చేస్తే పర్వాలేదు కాని, ఏదో ఆఫర్ల కోసం, అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఎక్స్పోజింగ్ చేయడం తప్పు అంటూ ఇతర హీరోయిన్స్కు సుద్దులు చెబుతుంది.
తన మటుకు తాను మాత్రం ఎక్స్పోజింగ్కు ఆమడ దూరంలో ఉంటాను అని, సినిమాకు ఎంత వరకు అవసరమో అంతే తాను ఎక్స్పోజింగ్ చేస్తాను అంటూ బాహాటంగానే చెప్పేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా కోరుకుంటున్న ఈ అమ్మడు ఎక్స్పోజింగ్ విషయంలో ఇలా మాట్లాడటం ఫిల్మ్ మేకర్స్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.గతంలో లిప్లాక్ చేసి, మోడల్గా ఉన్న సమయంలో బికినీలు కూడా వేసిన రకుల్ ఇప్పుడు నడుం చూయించేందుకు కూడా సిగ్గు అవుతోంది అంటూ మెలికలు తిరుగుతుంటే అంతా కూడా లోలోపల ఈమెకు కాస్త ఎక్కువ అయినట్లుంది అంటూ గునుకుంటున్నారు.
ఎక్స్పోజింగ్ విషయంలో ఈమె తన పద్దతిని మార్చుకోవాలని, అందాలను చూపించని పక్షంలో ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని కొందరు అంటున్నారు.