రాఖి సావంత్ .ఈ పేరు ఇప్పటివరకు వినకుండా ఉండటం కష్టమైన విషయమే.
కాబట్టి పరిచయాలు పెద్దగా అక్కరలేదు అనుకుంటా! ఈ వివాదాల రాణి ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది అని అనుకుంటున్నారా? కంగారు పడకండి .సన్ని లియోన్ ని దేశం నుంచి తరిమికొట్టండి అని మళ్ళీ స్టేట్మెంట్లు ఏం ఇవ్వలేదు.రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే, పూర్తిగా మందబుద్ధితో గవర్నమెంటు ఫ్యాన్ ని బ్యాన్ చేయాలని పిచ్చి పిచ్చి సలహాలు ఏం ఇవ్వలేదు.స్థాపించి వదిలేసిన రాష్ట్రియ ఆమ్ పార్టి నుంచి మళ్ళీ ఎలక్షన్లలో పాల్గొంటానని చెప్పలేదు.
ఈసారి వివాదస్పదమైన పని అనాలో లేదో తెలియదు కాని, కాస్త కొంటె పనే చేసింది.ప్రి ఇండిపెండెన్స్ ఉత్సవాలకి చికాగో వెళ్ళింది రాఖి.
వెళితే వెళ్ళింది కాని ఎవరు ఊహించుకోని డ్రెస్ వేసుకుంది.అది అలాంటి ఇలాంటి డ్రెస్ కాదు.
అందరి చూపు అమ్మడి వక్షోజాలపైనే.కాని కామంతో కాదు, ఆశ్చర్యంతో.
ప్రత్యేకంగా ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుంది.ఎబ్బెట్టుగా అనిపించే విషయం ఏమిటంటే, కావాలని మోడి చేతులు తన వక్షోజాల మీదకి వచ్చేలా డిజైన్ చేసుకుంది.సరే ఆ డ్రెస్ ని పట్టుకోని మీడియా హంగామా చేస్తే, మీడియా వల్గర్ గా ప్రవర్తిస్తోంది అని అనుకోవచ్చు.కాని రాఖి సావంత్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ ఇలా రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.
ఇదంతా ఎందుకు అంటే .మోడి మీద అభిమానంతో అంట.అయితే నిర్వాహాకుల్లో ఒకరైన షరీఫ్ కి రాఖి చేసిన పని అస్సలు నచ్చలేదట.రాఖి మీద సరైన చర్య తీసుకోవాలని, అలా చెత్త డ్రెస్ వేసుకోని ప్రధానిని అవమానించడం ప్రోత్సహించదగ్గ విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.