సంచలనాల బాలివుడ్ తార రాఖీ సావంత్ మరో సంచలనానికి సిద్ధపడుతోంది.ఈవిడకి వివాదాలు, సంచలనాలు కొత్త కాదు, కాని ఈసారి కొత్తరకం వివాదాన్ని, సంచలనాన్ని తెరపైకి తెచ్చింది.
రాఖికి మగాళ్ళు వద్దంట.అవును, మగవారిని డేటింగ్ చేయడం, పెళ్ళి చేసుకోవడం చేయదంట.
లెస్బియన్ గా ( ఫీమేల్ స్వలింగ సంపర్కురాలు) మారిపోయందట.తన లెస్బియన్ గర్ల్ ఫ్రెండ్ మరినా కువార్ తో కలిసి ఫోటోలకి తెగ ఫోజులిస్తున్న రాఖీ ఇప్పుడు ఆమెతో ప్రేమలో ఉందట.
అంతా సవ్యంగా సాగితే పెళ్ళి కూడా చేసుకుంటుందట.
ఇలా సినిమాతారలు లెస్బియన్ గా, గే గా మారటం హాలివుడ్ లో చాలా కామన్.
హాలివుడ్ హీరోయిన్ క్రిస్టన్ స్టీవార్ట్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ ని కాదని, తాను ఒక లెస్బియన్ అని అమ్మాయిలతోనే తిరుగుతోంది.చెప్పాంగా అక్కడ కామన్ అని.కాని ఇండియాలో ఇంతవరకు లెస్బియన్ సినిమాలే వచ్చాయి తప్ప, ఇలా నిజజీవితంలో లెస్బియన్ గా మారిన నటి లేదు.బహుషా రాఖి సావంత్ భారతదేశ సినీచరిత్రలో మొట్టమొదటి లెస్బియన్ గా గుర్తింపు పొందబోతోంది.
అయినా రాఖీ మాటలని అప్పుడే పూర్తిగా నమ్మడానికి వీల్లేదు.పూటకో మాట మార్చడం ఈ హాట్ హీరోయిన్ కి అలవాటే.
ఓరోజు మోడి లాంటి మగాడు కావాలి అంటుంది, మరోరోజు తనకు మగాళ్ళు వద్దు అంటుంది.మరి ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఎఫైర్ ఎన్నిరోజులు కొనసాగుతుందో, రాఖి మగాళ్ళకి ఎన్నిరోజులు దూరంగా ఉంటుందో చూడాలి.