తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇటీవలే ‘ఐ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇక ‘ఐ’ చిత్ర ఫలితాన్ని పక్కన పెట్టి శంకర్ తన తర్వాత చిత్రంపై దృష్టి పెట్టాడు.శంకర్ తర్వాత చిత్రం అజిత్ హీరోగా ఉండబోతుందని తమిళ మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే తాజాగా శంకర్ తర్వాత చిత్రం తలైవా రజినీకాంత్తో ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఈ చిత్రం గురించి వీరిద్దరు చర్చించుకున్నారు.
‘శివాజీ’, ‘రోబో’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.
రజినీకాంత్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘రోబో’కు సీక్వెల్ అయ్యి ఉంటుందని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి ఫిబ్రవరి 14న ఫస్ట్లుక్ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.శరవేగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నాడు.
రజినీ గత చిత్రం ‘లింగ’ నిరాశ పర్చడంతో తర్వాత సినిమా కోసం ఆయన అభిమానులు అంచనాలను తారా స్థాయిలో పెట్టుకున్నారు.మరి ‘శివాజీ’, ‘రోబో’ల తర్వాత తెరకెక్కబోతున్న ఈ మూడవ చిత్రంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందో చూడాలి.