రాజమౌళి కెరీర్ ఆరంభించిన ప్రారంభించినప్పటి నుండి కూడా అపజయమే ఎరుగకుండా విజయాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే.రాజమౌళి విజయాల పరంపరలో ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణికి కూడా ఎంతో కొంత భాగం ఉంది అనే విషయం అంతా ఒప్పుకోవాల్సిందే.
రాజమౌళి ప్రతి సినిమా కూడా మ్యూజికల్గా హిట్ను దక్కించుకుంది అంటే అది వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన కారణం.అయితే ‘బాహుబలి’ రెండవ పార్ట్ విడుద అయిన తర్వాత కీరవాణి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెల్సిందే.
దాంతో కొన్ని రోజులుగా రాజమౌళి ఆ తర్వాత ఎవరితో కలిసి పని చేస్తాడా అనే ప్రచారం జరుగుతోంది.
కీరవాణి తర్వాత రాజమౌళికి ఎక్కువ ఇష్టమైన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
దాంతో కీరవాణి తర్వాత దేవిశ్రీతో రాజమౌళి వర్క్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.అయితే తాజాగా ఈ విషయంపై కీరవాణి సోదరుడు అయిన సంగీత దర్శకుడు కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కీరవాణిని రీప్లేస్ చేసే సత్తా ఒక్క రహమాన్కే ఉందని, మరెవ్వరు కూడా రాజమౌళి స్థాయి సంగీతాన్ని ఇవ్వలేరు అంటూ చెప్పుకొచ్చాడు.దాంతో ‘బాహుబలి’ రెండవ పార్ట్ తర్వాత జక్కన్న చెప్పబోతున్న సినిమాకు రహమాన్ సంగీతాన్ని ఇచ్చే అవకాశాలు లేక పోలేదు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జక్కన్న తెరకెక్కించే సినిమాలు అన్ని కూడా బాలీవుడ్ స్థాయిలో ఉంటాయి.దాంతో ఏఆర్ రహమాన్తో సంగీతాన్ని ఇప్పిస్తేనే ఆ సినిమాకు మరింత హైప్ వస్తుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
ఈ ఇద్దరు సంచలన స్టార్స్ కలిస్తే ఆ సినిమా దుమ్ము రేపడం ఖాయం అని ఇప్పటి నుండే ప్రచారం జరుగుతోంది.